HomeTelugu Trendingదళిత యువకుడికి శిరోముండనం చేయించిన నూతన్‌ నాయుడు..

దళిత యువకుడికి శిరోముండనం చేయించిన నూతన్‌ నాయుడు..

Dalit organisation demandsతెలుగు బిగ్‌బాస్ ఫేం నూతన్‌ నాయుడు ఇంట్లో పని చేసిన దళిత యువకుడికి శిరోముండనం చేయడం వివాదంగా మారింది. నూతన్‌ నాయుడి భార్య మరికొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు, వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొబైల్ దొంగిలించాడనే ఆరోపణతో శిరోముండనం చేయించిన నూతన నాయుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఈనేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో నలుగురు మహిళలే ఉన్నారు. నూతన నాయుడు ఇంట్లో పనిచేసే సిబ్బందిపై పలు సెక్షన్‌ల కింద కేసు రిజిస్టర్ చేశారు. మధుప్రియ, ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నూతన్‌ నాయుడికి స్థానిక ఎమ్మెల్యే అండ ఉందని, అందుకే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. దళిత నేతలు నిర్వహించిన ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu