HomeTelugu Trendingప్రభాస్‌కు విలన్‌గా మధు గురుస్వామి

ప్రభాస్‌కు విలన్‌గా మధు గురుస్వామి

prabhas salaar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాచిత్రం సలార్ తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు విలన్‌గా కన్నడ నటుడు మధు గురుస్వామి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు విజయ్ సేతుపతి చేస్తున్నట్లు పుకార్లు వినిపించాయి. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏ హర్ష డైరెక్షన్‌లో వచ్చిన వజ్రకాయ సినిమాతో గురుస్వామి పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంతో కన్నడతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. సలార్ సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉందంటూ తనకు అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో గురుస్వామి వెల్లడించాడు. పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు గురుస్వామి. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ మధ్యే రామగుండంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu