HomeTelugu Newsఅందరం ఒక అవగాహనకు రావాలి: పవన్‌ కళ్యాణ్‌

అందరం ఒక అవగాహనకు రావాలి: పవన్‌ కళ్యాణ్‌

2 30

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యణ్‌.. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ ఈ మేరకు నిర్ణయించారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నాదెండ్ల మనోహర్‌, నాగబాబు పవన్‌కు 20 పేజీల నివేదిక అందజేశారు. ఈ నివేదికపై పార్టీ నేతలతో పవన్‌ చర్చించారు.

అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఆకాంక్షించారు. ఒకరికి న్యాయం చేసి, ఇంకొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదన్నారు. 3 రాజధానుల అంశంపై జరుగుతున్న చర్చ అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, ఇలాంటి సమయంలోఅందరం ఒక అవగాహనకు రావాలని అన్నారు. జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu