HomeTelugu Trending'జాతిరత్నాలు' సీక్వెల్స్‌ స్టోరీ ఇదేనా!

‘జాతిరత్నాలు’ సీక్వెల్స్‌ స్టోరీ ఇదేనా!

Jathi Ratnalu sequel story
టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌ అందుకుంది జాతిరత్నాలు. అనుదీప్ కెవి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు పోషించారు. ఈ చిత్రం 4కోట్లతో తెరకెక్కి 40కోట్లు పైగా వసూలు చేయడం.. పైగా అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్ ని అందుకోవడం సంచలనమైంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నామని చిత్రబృందం ప్రకటించగానే అందరిలో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు నవీన్ పోలిశెట్టి, కెవి బృందం సీక్వెల్ ఆలోచనల్లో తలమునకలుగా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలో సీక్వెల్ స్క్రిప్ట్ పైనా వర్క్ చేస్తున్నారట. ఈ సీక్వెల్ కథ ఎలా ఉండనుంది? ఈ సీక్వెల్స్‌లో ముగ్గురు ఉపాధి కోసం అమెరికా వెళితే ఎలా ఉంటుందో చూపిస్తారట. నిజానికి కథ కంటే కామెడీ పైనా దృష్టి సారించిన సపరేట్ జోనర్ సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu