HomeTelugu Trendingభయపెట్టి రూ. 130 కోట్లు వసూలు చేసిన లారెన్స్

భయపెట్టి రూ. 130 కోట్లు వసూలు చేసిన లారెన్స్

4 20

గత నెలలో విడుదలైన ‘కాంచన 3’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రం పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టుకుంది. తమిళ సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలకు సైతం కష్టతరమైన ఈ వసూళ్లను లారెన్స్ అవలీలగా రాబట్టడం విశేషం. ‘ముని, కాంచన’ ప్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రాన్ని లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇదే ప్రాంఛైజీలో లారెన్స్
మరికొన్ని సినిమాలు చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu