HomeTelugu Trendingమహేశ్‌బాబుతో నటించడంపై కత్రిన స్పందన.!

మహేశ్‌బాబుతో నటించడంపై కత్రిన స్పందన.!

1 30బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’, బాలయ్యతో ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ‘మహర్షి’ తర్వాత చేయబోయే చిత్రంలో తో కత్రినా హీరోయిన్‌గా నటించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు అలా కత్రినా దగ్గరకు చేరాయి. దీంతో ఆమె ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. మహేశ్‌ చిత్రం చేయాలని తనను ఇంతవరకు ఎవరూ నన్ను సంప్రదించలేదన్నారు.

సనేను మహేశ్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నానని చాలా మంది అనుకుంటున్నారని తెలిసింది. ఇలాంటి గాలి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలకుంటున్నాను. ‘భారత్‌’ తర్వాత నేను ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ‘భారత్‌’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటిలోపు ఇది ప్రేక్షకుల ముందుకు రావాలంటే నేను వేరే చిత్రం మీద ఏకాగ్రత పెట్టకూడదు. షూటింగ్‌ ఆలస్యమయితే మళ్లీ విడుదల తేదీ కూడా ఆలస్యమవుతుంది. అందుకే నేను వేరే చిత్రం చేయడం లేదు. నాకు సాధ్యం కాదు కూడా’ అని తెలిపారు. ‘భారత్‌’లో సల్మాన్‌కు జోడీగా కత్రినా నటిస్తోంది. అలీ ఆబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu