HomeTelugu Trendingఅమితాబ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అమితాబ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Police case on amitabh andబాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయనపై లక్నోలోని ఓ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు కావడం వివాదంగా మారింది. గత శుక్రవారం నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ పాల్గొనగా.. ఆయన్ను అడిగిన ఓ ప్రశ్న వివాదానికి తెరలేపింది.

6,40,000 క్యాష్ ప్రైజ్‌కు గాను.. డిసెంబర్‌ 25వ తేదీ1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్న అడిగారు అమితాబ్. వీటికి `ఎ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి` అని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు జవాబుగా మను స్మృతి అనే ఆన్సర్ ఇచ్చేటపుడు బిగ్ ‌బీ.. మనుస్మృతిని ఆనాడు బీఆర్ అంబేద్కర్ తగలబెట్టిన విషయాన్ని వివరించారు. దీంతో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ ట్రోలింగ్ మొదలైంది. ఈ మేరకు ఓ వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో పాటు కేబీసీపై కేసు నమోదు చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu