HomeTelugu Trendingకీర్తి సురేష్‌కు మరోసారి బాలీవుడ్ ఆఫర్!

కీర్తి సురేష్‌కు మరోసారి బాలీవుడ్ ఆఫర్!

Keerthi Suresh Bollywood of

మహానటి సినిమాతో ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్న నటి కీర్తిసురేశ్‌. ఆ సినిమా తర్వాత కీర్తిని ప్రేక్షకులు వేరే పాత్రలో చూడలేకపోయారు. దీంతో చాలాకాలంగా ఆమెకు సక్సెస్‌లు రాలేదు. ఎలాగైనా మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావించిన కీర్తి సురేష్ తన రూట్‌ మార్చి గ్లామర్‌ షోకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్‌ రోల్‌తో హిట్‌ అందుకుంది. ఆ తర్వాత నాని దసరా సినిమాతో కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కీర్తి సురేశ్‌కు ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను ప్లాన్‌ చేశాడు. ఈ సినిమాకు కోలీవుడ్‌ డైరెక్టర్‌ కాలిస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకోసం దక్షిణాది నుంచి హీరోయిన్‌ను తీసుకోవాలని మేకర్స్‌ భావించారు.

సౌత్‌లో ఇప్పుడు ఫామ్‌లో ఉన్న కీర్తి సురేశ్‌ను ఈ సినిమా కోసం సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం.అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలో ఓసారి కీర్తిసురేష్‌కు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పట్లో అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కిన మైదాన్‌ సినిమాకు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. కానీ సినిమా షూటింగ్‌ మొదలైన తర్వాత ఆమెను తప్పించారు.

మైదాన్‌ సినిమాలో కీర్తి సురేశ్‌తో పలు సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. కీర్తి తప్పుకోవడంతో ఆ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేశారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ నుంచి కీర్తి సురేష్‌కు అవకాశం రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu