దేశమంతా కరోనా గందరగోళం నడుస్తుంటే.. మహానటి ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. ఏడాదిపాటు పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సడన్గా పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి ఆల్రెడీ ప్రేమలో ఉందా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అని అభిమానులకు రకరకాల సందేహాలు వస్తున్నాయి. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీజేపీ నాయకుడి కొడుకుతో ఈ ఏడాది చివర్లో పెళ్లి కాబోతుందని ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, అలాంటి వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మరో ఏడాది వరకు నీను చాలా బిజీ.. సినిమాలు చేయాడానికే సమయం లేద.. ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుందని తెలియజేసింది.
కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. డైరెక్టర్ కుక్నూరు నగేష్ తొలిసారి తెలుగులో క్రీడల కథాంశంతో తెరకెక్కిస్తున్న గుడ్లక్ సఖి సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది. మరోవైపు మహానటి సినిమా తర్వాత తెలుగులో కీర్తి నటించిన మిస్ ఇండియా విడుదలకు రెడీగా ఉంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగ్దే’ సినిమాలోనూ కీర్తి నటిస్తోంది. రజనీకాంత్ సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు, పెంగ్విన్, మోహన్లాల్ నటిస్తున్న మలయాళ చిత్రం మరక్కార్లో నటిస్తోంది.