ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా రాబోతున్న కేజీఎఫ్-2 విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. జనవరి 7న విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో 200 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా సోషల్మీడియాలో వెల్లడించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ టీజర్ కు ఇప్పటివరకు 8.4 మిలియన్లకు పైగా లైక్స్ రావడం మరో విశేషం. ఇందులో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Thank you everyone for the thundering response!!!https://t.co/4PzV1fc4uk#KGF2Teaser200MViews pic.twitter.com/dsByWfRaX5
— Prashanth Neel (@prashanth_neel) July 16, 2021