HomeTelugu Newsమహేష్ బాబు విభిన్న పాత్రలో 27వ సినిమా..!

మహేష్ బాబు విభిన్న పాత్రలో 27వ సినిమా..!

12 1
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 27వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుందట.

ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర కాగా మరొకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర. గ్యాంగ్‌స్టర్ గా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడని ఆ తర్వాత లెక్చరర్ పాత్ర చేయబోతున్నట్లు చెబుతున్నారు. గతంలో వచ్చిన పలు గ్యాంగ్‌స్టర్ చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా హీరో ఫ్లాష్ బ్యాక్ ను కలిగి ఉంటాడని అంటున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చిన ఈ సినిమా కొత్తగా ఉంటుందని చిత్రయూనిట్ చెప్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu