టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన ‘సరిలేరు నీకెవరు’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తరవాత మహేష్ బాబు వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. వైజాగ్ పోర్ట్ ఏరియాలో జరిగే గ్యాంగ్ వార్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడంట వంశీ. వైజాగ్ పోర్ట్ ను శాసించే పవర్ఫుల్ డాన్ గా మహేష్ కనిపిస్తారని సమాచారం. గతంలో మహేష్ బిజినెస్ మ్యాన్, పోకిరి సినిమాలు గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో వచ్చినవే.. ఈ సినిమాలు మంచి హిట్అందుకున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాథిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు డైరెక్టర్ వంశీ. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మహేష్ తిరిగి రాగానే షూటింగ్ లో జాయిన్ అవుతాడు.