HomeTelugu Newsఇంటికి చేరుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ..

ఇంటికి చేరుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ..

11 7
కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఎంతోమంది చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా అయిపోయింది. ఎన్నో కుటుంబాలను ఈ కరోనా మహమ్మారి విడదీసింది. లాక్‌డౌన్‌తో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. సొంతూరుకు వెళ్లే పరిస్థితి లేక నానా అవస్థలుపడుతున్నారు. ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు తిరగకపోవడంతో విదేశాల్లో చిక్కుకున్నవారి పరిస్థితి మరీ దారుణం. దీనికోసం భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. పలు దేశాలకు విమానాలను పంపి భారతీయులను రప్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే విదేశాల్లో చిక్కుకున్నవారు స్వదేశానికి చేరుకుంటున్నారు.

లాక్‌డౌన్ కారణంగా సింగపూర్‌లో చిక్కుకుపోయిన డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌ బాబు కుమారుడు విష్ణు ఫ్యామిలీ భారత్ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగానే మంచు విష్ణు భార్య విరానికా, పిల్లలు సింగపూర్‌ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు భార్య విరానికా ట్విట్టర్‌లో తెలిపారు. విమానంలో తన పిల్లలతో దిగిన ఫొటోను షేర్ చేశారు. వంద రోజుల తర్వాత సింగపూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. వందే భారత్ మిషన్, ఎయిర్ ఇండియా, సింగపూర్ బృందానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu