HomeTelugu Trending'ఢీ' సీక్వెల్స్‌పై అప్‌డేట్‌ ఇవ్వనున్న మంచువిష్ణు

‘ఢీ’ సీక్వెల్స్‌పై అప్‌డేట్‌ ఇవ్వనున్న మంచువిష్ణు

Manchu Vishnu Tweet About D

హీరో మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమా ఓ మైలు రాయిలాంటిది. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీసు వద్ద కూడా ఘన విజయాన్ని సాధించింది. పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో మంచు విష్ణు దీనికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చాడు. ‘వేలాది సినీ ప్రియులకు ఇష్టమైన సినిమాలలో ఢీ ఒకటి. ఆ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులకి సిబ్బందికి ఇదొక కొత్తదనాన్ని ఇచ్చింది. ఆ సమయంలో కొత్తరకం సినిమాలకు ఇదొక ఊపునిచ్చింది. అయినా, ఢీ కన్నా బెటర్ మరేముంది?’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. అంతేకాకుండా, ఈ నెల 23న ఓ ఉత్తేజకరమైన అప్‌డేట్ ను ఇస్తున్నానని విష్ణు పేర్కొన్నాడు. దీనిని బట్టి చూస్తే ‘ఢీ’ సినిమా సీక్వెల్ కి రంగం సిద్ధమౌతున్నట్లు అనిపిస్తుంది. చూడాలి మరి మంచు విష్ణు ఏం ప్రకటించబోతున్నాడో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu