HomeTelugu Trending'శ్రీకారం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి

‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి

Megastar chiranjeevi chief
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఈవెంట్‌ నిర్వాహక సంస్థ శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ హాజరవుతారని తెలిపారు. సినీ దర్శకుడు డి.కిషోర్, సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్, చిత్ర బృందం పాల్గొంటుందని తెలిపారు.

మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో‌ వ్యవసాయం చేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి కుమార్ నెగిటివ్ పాత్రలో చూపించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కి చే మేయర్ సంగీతాన్ని అందించారు. మార్చి 11న శివరాత్రి సందర్బంగా ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!