దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు అన్ని జిల్లాలో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా.. లేక పొడిగిస్తారా అనే చర్చ అందరూ చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజలను రక్షించడానికి డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు వైరస్పై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తో పాటు సెలబ్రెటీలంతా వైద్యులను పోలీసులను, పారిశుద్ద్య కార్మికులకు సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పోలీసులకు సెల్యూట్ తెలిపారు. ప్రజలకోసం పోరాడుతున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నా.. జైహింద్’అంటూ చిరంజీవి ఓ వీడియో ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020