HomeTelugu Big Storiesనాలుగు సినిమాలను లైన్‌లో పెట్టిన మెగాస్టార్‌.. దర్శకులు వీళ్లే

నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టిన మెగాస్టార్‌.. దర్శకులు వీళ్లే

Megastar chiranjeevi with h

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా త్వరలో పూర్తికానుంది. ఇక దీని తరవాత చేయబోయే సినిమాలుగా ఆయన ఇప్పటికే ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ ను, ‘వేదాళం’ తమిళ రీమేక్ ను ప్రకటించారు. వీటిలో లూసిఫర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. వేదాళం చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక తాజాగా చిరంజీవి తన నాలుగో చిత్రాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి ఆమధ్య ‘వెంకీమామ’ చిత్రాన్ని రూపొందించిన బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తాడు.

Review – Freedom at Midnight – Written and narrated beautifully

ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడిస్తూ ‘వీరు నా నలుగురు కెప్టెన్లు.. ఈ నలుగురూ ఫెంటాస్టిక్ ఫోర్.. చార్ కదమ్” అంటూ పోస్ట్ పెట్టి మెహర్ రమేశ్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీలతో కలసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గా పూర్తి ఎంటర్ టైన్మెంట్ కథను బాబీ తయారుచేశాడట. ఇది చిరంజీవికి బాగా నచ్చడంతో ప్రాజక్టును ఓకే చేసినట్టు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu