టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్బీ అమితాబ్. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో చిరంజీవికి గురువు పాత్రలో అమితాబ్ నటించారు. అయితే వీరిద్దరూ కలిసి ఓ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అమితాబ్ కోరిక మేరకు హిందీ సినిమాలో నటించేందుకు చిరంజీవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవిది ఎలాంటి పాత్ర అని అభిమానులు లెక్కలు వేసేసుకుంటున్నారు. చిరంజీవి గతంలో ప్రతిబంధ్, ఆజ్కా గూండారాజ్, ది జెంటిల్మెన్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఇద్దరు మెగాస్టార్లు కలిసి అభిమానులకు కనువిందు చేయబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లు. ఇప్పటికే ఖమ్మం షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.