కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దానితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలకోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ లంచ్ చేసారు. సంజీవయ్యపార్క్ దగ్గర ఈవీడీఎం యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్. పోలీసులకు దీటుగా జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. అందరి యోగ క్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.
Was a pleasure to have my lunch today along with the GHMC frontline warriors today 🙏😊
Thanked them for their fabulous efforts as #TelanganaFightsCorona https://t.co/qyXCUwD0AD
— KTR (@KTRTRS) April 22, 2020