HomeTelugu Trendingదృశ్యం సీక్వెల్..‌

దృశ్యం సీక్వెల్..‌

7 20
టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్ ఆరేళ్ల క్రితం నటించిన చిత్రం ‘దృశ్యం’. మలయాళం చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ చిత్రం. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్టులో నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, మీనా జంటగా అదే పేరుతో
రీమేక్ చేయగా, ఇక్కడ కూడా మంచి హిట్టయింది. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా విజయాన్ని సాధించింది.

ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ మీడియాకు వెల్లడించారు. సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తారని చెప్పారు. ఈ సీక్వెల్ లో తొలి భాగంలో లేని పలు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఎదురు చూస్తున్న సినిమాలు ఇక చకచకా ఈ పనులు జరుపుకోబోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu