HomeTelugu Trendingఅమ్మ చెప్పినప్పుడు ఎవరు వినలేదు.. ఇప్పుడు తెలుస్తుంది.

అమ్మ చెప్పినప్పుడు ఎవరు వినలేదు.. ఇప్పుడు తెలుస్తుంది.

1 20ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ విలువైన మాటలు పంచుకున్నారు. ‘భయపడాల్సిన అవసరం లేదు.. అంతా చక్కబడుతుంది’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు.

”చిన్నతనంలో మా అమ్మ చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నా. సబ్బుతో చేతులు బాగా శుభ్రం చేసుకోమని చెప్పేది. ‘ఎందుకు బయట తిరుగుతుంటావు.. ఇంట్లో ఉండొచ్చుగా’ అనేది. ‘ఈ హాయ్‌, హలో ఏంటి?.. మీరు సలామ్‌, నమస్తే చెప్పడం మర్చిపోయారా’ అనేది. తుమ్ముతుంటారు, దగ్గుతుంటారు కాబట్టి.. జేబులో ఎప్పుడు కర్చీఫ్‌ పెట్టుకోవాలని చెప్పేది. మనకెన్నో విషయాలు నేర్పించాలి అమ్మ అనుకుంది. కానీ ఎవరు విన్నారు? ఇవాళ ఈ ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనాతో పోరాడుతోంది. అమ్మ చెప్పిన చిన్న విషయాలు ఎంత పెద్దవో ఇప్పుడు నాకు అర్థమైంది. పాఠశాలలో నాకు పరీక్షలు జరుగుతున్నప్పుడు చాలా భయపడేవాడ్ని. అప్పుడు అమ్మ ‘భయపడొద్దు.. అంతా సజావుగా జరుగుతుంది’ అని చెప్పేది. ఇవాళ ఈ ప్రపంచానికి పరీక్ష సమయం ఎదుర్కొంటుంది… అమ్మ మళ్లీ అదే చెబుతోంది. అంతా సజావుగా మారుతుంది..’ అని ఆయన వీడియోలో చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu