మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలకృష్ణని కెలికాడు. తరచూ ఎదోఒక సెటైర్లు వేస్తూనే ఉంటున్నాడు నాగబాబు. మొన్నటి వరకు ఓ వివాదం నడిస్తే.. ఇప్పుడు మరో ఇష్యుకి తెరలేపాడు. ఇక విషయం ఎంటంటే.. బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని’ కథ సినిమాలో శివశంకరీ పాట బాలయ్య పాడాడు. ఈ వయసులో ఈయన చేసిన సాహసాన్ని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు.
గాత్రం బాగుందా బాలేదా అనేది పక్కనబెడితే ఏ మాత్రం జంకకుండా బాలయ్య చేసిన ప్రయత్నాన్ని వాళ్లు మెచ్చుకుంటున్నాడు. నాగబాబు నేరుగా ఈ పాటపై సెటైర్ వేశాడు. బాలకృష్ణ పేరు ప్రస్తవించకుండా.. కారోన జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం circulate అవుతుందిరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా.. దండం పెడతాను…అయ్యబాబోయ్ చిన్న పిల్లలని old age వాళ్ళని, హెల్త్ బాగలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదేన జరగొచ్చు.. అయినా ఎందయ్యా ఇది.. ఇది నేను చూళ్లే.. ఎక్కడ ఇనలే.’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దానికి ఎమోజీని కూడా యాడ్ చేశాడు. అయితే ఆ పోస్టు పెట్టిన గంటకు తరువాత దానిని డిలీట్ చేశాడు.