నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూతకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మధ్యకాలంలోని తెలుగు వెబ్సిరీస్లలో ‘దూత’ ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు విక్రమ్ కుమార్ కథను మలిచిన తీరు, కథనాన్ని నడిపించిన విధానం బాగుందనే చెప్పాలి.
దూత వెబ్ సిరీస్ హారర్తో కూడిన మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది. ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమ్ అవుతోంది. నాగచైతన్య హీరో అయితే ఆయన భార్యగా ప్రియా భవాని శంకర్ నటించింది.
విక్రమ్ కుమార్ టేకింగ్ పరంగా ఈ సిరీస్ మెప్పిస్తోంది. డీసీపీ క్రాంతిగా నటించిన పార్వతి తిరువోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సిరీస్లో ఆమె వరుస హత్యలకు సంబంధించి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా రంగంలోకి దిగుతుంది. ఎదుటివ్యక్తిని కళ్లతో చూస్తూనే చదివేసే పాత్రకి ఆమె జీవం పోషించింది. విశాలమైన ఆమె కళ్లు ఈ పాత్రకి మరింత హెల్ప్ అయ్యాయి.
పార్వతి తిరువోతు ధైర్యం, హుందాతనం కలిగిన బాడీ లాంగ్వేజ్తో ఆమె పాత్రకి మరింత వన్నె తెచ్చింది. ఈ సిరీస్ చూసిన వాళ్లంతా ఆమె నటనే హైలైట్ అని చెప్తున్నారు. మలయాళంలో 2006లో మలయాళంలో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.
ఉత్తమనటిగా అనేక అవార్డులను అందుకున్న పార్వతి తిరువోతు ఇకపై తెలుగు సినిమాల్లోను కనిపించే అవకాశాలు ఉన్నాయి.