టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున చివరిగా నటించిన ‘మన్మధుడు 2’ ఆయనకు నిరాశను మిగల్చడంతో పాటు.. విమర్శలు కూడా తీసుకొచ్చింది. ఈ వయసులో ఇలాంటి సినిమాలు ఏంటీ అంటూ.. సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రీమేక్ సినిమాతో హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు నాగ్.
బాలీవుడ్ లో అజయ్దేవ్గన్, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘రైడ్’. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. రైడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట నాగ్. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు . ఇక ఈ సినిమాలో హిందీ ‘రైడ్’ లో హీరోయిన్ గా నటించిన గోవా బ్యూటీ ఇలియానానే తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం నాగార్జున కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు.