HomeTelugu Trending'సర్కారువారి పాట' సెట్‌లో నమ్రత

‘సర్కారువారి పాట’ సెట్‌లో నమ్రత

namrata in Sarkaru vaari paసూపర్‌ స్టార్‌ మహేశ్‌ హీరోగా పరుశురామ్‌ డైరెక్షణ్‌లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్‌ తన ఫ్యామిలీని తీసుకొని స్పెయిన్‌ వెళ్లారు. ఓ వైపు మహేశ్‌ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్‌లో ఉన్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్రీకరణలో స్పెయిన్‌లో ముగిసింది.

చివరి రోజున సినిమా సెట్స్‌లో మహేశ్‌ భార్య నమ్రత సందడి చేసింది. సాంగ్‌ షూట్‌ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Recent Articles English

Gallery

Recent Articles Telugu