HomeTelugu Trendingసైరా ఈవెంట్‌లో నయనతార

సైరా ఈవెంట్‌లో నయనతార

7 15దక్షణదిలో వరసగా భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. సాహో తరువాత ఇప్పుడు సైరా విడుదలకు రెడీ అవుతున్నది. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరు అంటే నయనతార అని చెప్తారు. ఆమె సినిమాకు దదాపు రూ. 7 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది.

సినిమాలో నటించడం వరకే చేస్తుంది. ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఆమె పాల్గొనదు. అయితే, సైరా, బిగిల్ యూనిట్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ రెండు ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు నయనతార ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈనెల 19 వ తేదీన విజయ్ బిగిల్ ఆడియో వేడుక చెన్నైలో జరగబోతున్నది. ఆ వేడుకలో నయనతార పాల్గొనబోతున్నది. అలానే సెప్టెంబర్ 22 న హైదరాబాద్ లో జరిగే సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నయనతార పాల్గొనబోతున్నది. ఇది సైరాకు నిజంగా శుభవార్తే అని చెప్పాలి. నయనతార సినిమాలో ఉంటె ఆ సినిమాకు మైలేజ్ వస్తుంది. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటే అది ఎక్స్ట్రా మైలేజ్ అని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu