HomeTelugu Trendingకరోనాపై పోరుకు నిధి అగర్వాల్‌ సాయం!

కరోనాపై పోరుకు నిధి అగర్వాల్‌ సాయం!

8 22
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే. కరోనా పోరుకు తమ వంతు సాయం గా సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హాట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కరోనా పై పోరుకు ముందుకు వచ్చింది. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది‌. ఇటీవల రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుత లాక్‌డౌన్ టైమ్‌ను వేస్ట్ చేయకుండా న్యూయార్క్ ఫిల్మ్ కోర్సును ఆన్‌లైన్‌లో నేర్చుకుంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. నిధి అగర్వాల్ కూడా పీఎం కేర్ ఫండ్.. వెల్ఫేర్ అఫ్ స్ట్రే డాగ్స్.. కరోనా క్రైసిస్ ఛారిటీ.. సీఎం రిలీఫ్ ఫండ్.. స్ఫూర్తి సంక్షేమ సేవా సంఘ్‌ మొదలైన వాటికి కంట్రిబ్యూట్ చేసినట్లు నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఎంత ఇచ్చిందో మాత్రం చెప్పలేదు. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్స్ ప్రణీత, లావణ్య త్రిపాఠి రకుల్ ప్రీత్ సింగ్ – కాజల్ అగర్వాల్ – తమన్నా ముందుకొచ్చి తమకు తోచిన విధంగా సహాయం అందించిన విషయం తెలిసిందే .

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!