నిత్యామీనన్కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. 50వ సినిమా మైలురాయిని అందుకున్నారు. మలయాళంలో నిత్యామీనన్ చేయబోతున్న ‘ఆరామ్ తిరుకల్పన’ తన 50వ సినిమా. ఈ సినిమాలో నిత్యా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన నిత్యామీనన్ హీరోయిన్గా మారి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. 2008లో హీరోయిన్గా మలయాళ సినిమా చేశారు. 2010లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. ‘మిషన్ మంగళ్’ తో ఈ ఏడాదే బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చారు