HomeTelugu Newsమరోసారి నితిన్‌కు జంటగా కీర్తి సురేష్‌..

మరోసారి నితిన్‌కు జంటగా కీర్తి సురేష్‌..

2 24

టాలీవుడ్ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమాతో హిట్ అందున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ఈ చిత్రంలో ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతుంది. షూటింగ్ లు పూర్తి స్థాయిలో మొదలైతే కీర్తి చేతినిండా పనితో ఫుల్ బిజీగా మారిపోనుంది. ఇప్పటికే కీర్తి నటించిన ‘పెంగ్విన్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మరో సినిమా ‘మిస్ ఇండియా’ కూడా ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నితిన్ సరసన ‘రంగ్ దే’లో నటిస్తూనే ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనుందట కీర్తి. ‘రంగ్ దే’ తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన ‘పవర్ పేట’ చేస్తున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu