HomeTelugu Newsచంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు

చంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు

9 15కృష్ణా జిల్లా ఉండవల్లిలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసానికి సీఆర్డీఏ అధికారులు ఇవాళ మరోమారు నోటీసులు అంటించారు. కరకట్టపై నిర్మించిన ఆ నివాసాన్ని అక్రమ కట్టడంగా గుర్తించామని వారం రోజుల్లోగా ఖాళీచేసి కూల్చివేయాలని లేదంటే తామే కూల్చేస్తామంటూ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. లింగమనేని ఎస్టేట్ యజమాని లింగమనేని రమేష్ పేరుమీదుగా నోటీసులను అంటించారు.

గతంలో నోటీసులు ఇచ్చిన సమయంలో లింగమనేని రమేష్ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌… నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు అంటించడంతో అక్కడ కలకలం మొదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu