మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్లో మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పవన్ తేజ్ కొనిదెలను హీరోగా థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఈ కథలో పాత్రలు కల్పతం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఎంవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో మేఘనా హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ అనంతరం పనులను చూసుకుంటుంది. అయితే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ అందరికీ థ్రిల్ను కలిగిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.