
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గబాటి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం 9.45గంటలకు ఈ మూవీ టైటిల్, పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించి గింప్స్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పవన్ కళ్యాణ్… భీమ్లానాయక్గా కనిపించనున్నారు. నిత్య మీనన్, ఐశ్యర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.













