పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పింక్’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఇక పవన్ వరుసగా సినిమాలు చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పింక్’ తరువాత ఆయన దాదాపు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందనే వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. నిర్మాత ఎ.ఎమ్.రత్నం బ్యానర్లో పవన్ ఒక సినిమా చేయవలసి వుంది. పవన్ రాజకీయాల్లోకి రావడం వలన ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది.
ఇప్పుడు ఎ.ఎమ్.రత్నం ఈ ప్రాజెక్టును క్రిష్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. బుర్రా సాయిమాధవ్ తో కలిసి స్క్రిప్ట్ పై ఆయన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన కూడా వుంటుందట. ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.