పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన సెకండె ఇన్నింగ్స్.. పింక్ సినిమా రీమేక్తో మొదలుపెట్టాడు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ను ఇంకా సస్పెన్స్గానే ఉంచుతున్న చిత్ర యూనిట్… రిలీజ్ డేట్ను మాత్రం కన్ఫామ్ చేసింది. గతంలో గబ్బర్ సింగ్ విడుదల చేసి మంచి హిట్ అందుకున్న పవన్… ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో మిడ్ సమ్మర్లో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. మే-15న పింక్ రీమేక్ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. పవన్ ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటుండగా… పవన్తో పాటు నివేథ థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీలో పింక్ చూసిన వారికి కూడా తెలుగులో కొత్తగా కనిపించేలా తెలుగు ప్రేక్షకుల టేస్ట్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశామని ప్రకటించాడు దిల్ రాజు. ఉగాది నుండి సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.