భారత్ విధించిన 21 రోజుల లాక్డౌన్ కార్యక్రమం రేపటితో పూర్తవుతుంది. 21 రోజులపాటు లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా కరోనా నుంచి దేశం బయటపడలేదు. పైగా రోజురోజుకు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 9వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ లాక్ డౌన్ గురించి ఏం మాట్లాడబోతున్నారు అన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
ఈరోజు ప్రధాని మోడీ ఈ అంశంపై జాతినుద్దేశించి మాట్లాడతారని వార్తలు వచ్చాయి. కానీ, రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడబోతున్నారు. లాక్డౌన్ ను పొడిగించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ను పొడిగిస్తారా లేదంటే కొన్ని పరిమితులతో సడలిస్తారా లేదంటే 100శాతం లాక్ డౌన్ చేసి కంట్రోల్ చేస్తారా అన్నది రేపటి వరుకు వేచి చూడాల్సిందే. ఏదైనా రేపు ఉదయం 10 గంటలకు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.