HomeTelugu Newsసనత్‌నగర్‌లో చైనీయులను పట్టుకున్న పోలీసులు

సనత్‌నగర్‌లో చైనీయులను పట్టుకున్న పోలీసులు

15 6
ఇప్పటికే హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ బాధితులు రోజూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు చైనీయులను ఎర్రగడ్డ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగాలాండ్‌కు చెందిన ఓ యువతితో చైనీయులు యువతీ యువకుడు కారులో మూసాపేట వైపు వెళ్తుండగా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. వారు ముగ్గురిని ప్రశ్నించగా కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో గత 8 నెలలుగా ఉంటున్నట్టు వెల్లడించారు. వీరు ముగ్గురిని పోలీసులు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu