యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి సినిమాపైనే ఉంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్తో భారీ బడ్జెట్తో రూపొదించిన సినిమా కావటంతో సాహోపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా సాహోకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త అందరినీ అవాక్కయ్యేల చేస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్కు సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకు రావు. అయితే సాహో సినిమాకు సంబంధించిన కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ సినిమాకు ప్రభాస్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ పారితోషికం తీసుకోని యంగ్ రెబల్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లో 50 శాతం వాట తన పారితోషికంగా తీసుకోనున్నాడట.
300 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వందకోట్లకు పై మాటే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల సరసన ప్రభాస్ నిలవనున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్ రెమ్యూనరేషనే ఎక్కువ అవుతుంది.
సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాడేలతో పాటు వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.