దర్శకుడు పూరి జగన్నాథ్, బాలకృష్ణలు గతంలో ‘పైసా వసూల్’ సినిమాను చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. అయినా వీరిద్దరూ కలిసి మరో సినిమా చేద్దాం అనుకున్నారు. ఇంతలోపే ఇరువురు వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రసుతం పూరి తాను చేస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని పూర్తిచేయడంతో మరోసారి బాలయ్యతో సినిమా ఎప్పుడని ప్రస్తావన తెరపైకి వచ్చింది.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన పూరి.. బాలకృష్ణగారితో ఇంకో సినిమా చేయాలి. ఆయన దాదాపు అన్ని రకాల సినిమాలు చేశారు. కాబట్టి ఆయన కోసం కొత్త తరహా కథ రాయాలనుకుంటున్నాను. ఎప్పుడు కథ సిద్ధం అయితే అప్పుడు ఆయన్ను కలుస్తాను అన్నారు.