కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ సినిమ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం మరాఠీలో వచ్చిన ‘నట సామ్రాట్’ సినిమాకి ఇది రీమేక్. ఒక రంగస్థల కళాకారుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగ్ విడుదలైంది.
‘పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించారు. ఇళయరాజా స్వరపరచారు. అంతే కాకుండా ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించారు.
ఈ పాట ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక నటీనటుల లుక్ కూడా నేచురల్గా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను నటించారు. ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు