రాజ్తరుణ్, హెబ్బాపటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ను హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో నరేశ్, వాణీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర కీలక ప్రాత్రల్లో నటించారు. కరోనా కారణంగా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా ‘అక్టోబర్ 2’న విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసినందుకు నాగ చైతన్యకు రాజ్ తరుణ్ శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇప్పటికే రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ ‘కుమారి 21ఎఫ్’లో నటించిన విషయం తెలిసిందే.