HomeTelugu Trendingగుండె పగిలినంత పని అయింది.. రజినీ భావోద్వేగ ట్వీట్‌

గుండె పగిలినంత పని అయింది.. రజినీ భావోద్వేగ ట్వీట్‌

4 30బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. రెండురోజుల క్రితం సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. 2018లో క్యాన్సర్ బారిన పడిన రిషీ కపూర్ అమెరికాలో చికిత్స చేయించుకుని ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇర్ఫాన్ ఖాన్ నిన్న కన్ను మూసిన సంగతి తెలిసిందే.. ఈ లోగానే రిషి కపూర్ మరణం ఇండస్ట్రీని మరింత విషాదంలోకి నెట్టింది. ఈ విషాదాలపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.”ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని అన్నారు.

అలాగే మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ రిషీ కపూర్ మృతి తన మనస్సును చాలా బాధపెట్టిందని చెప్పారు. రిషీ కపూర్ మరణం సినీ పరిశ్రమకు కోలుకోలేని నష్టం అన్నారు. రిషీ కపూర్ నిజమైన లెజెండ్ అన్నారు. రణబీర్ మరియు అతని కుటుంబ సభ్యులకు మహేష్ బాబు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

సూపర్ స్టార్ రజిని కాంత్ సోషల్ మీడియా వేదికగా ‘ గుండె పగిలినంత పని అయింది. నీ ఆత్మకి శాంతి చేకూరాలి నా ప్రియమైన స్నేహితుడా …’అని భావోద్వేగ ట్వీట్ చేసారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu