HomeTelugu Trendingపాన్‌ ఇండియా మూవీగా 'రాక్షకుడు-2'

పాన్‌ ఇండియా మూవీగా ‘రాక్షకుడు-2’

Rakshasudu 2 will go rs 100

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షసుడు’. రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసుడు-2’ రూపుదిద్దుకోనుంది. ఇటీవల ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ‘రాక్షసుడు-2’ చిత్రానికి సంబంధించిన ఓ సరికొత్త అప్‌డేట్‌ను సోమవారం పంచుకుంది.

‘రాక్షసుడు’ కంటే మరింత ఉత్కంఠభరితమైన కథతో రూపుదిద్దుకోనున్న ‘రాక్షసుడు-2’ చిత్రాన్ని ఇందుకోసం సుమారు 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, సినిమా పూర్తిగా లండన్‌లో షూటింగ్‌ జరపనున్నట్లు చెప్పారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఓ టాప్‌ నటుడ్ని ఇందులో హీరోగా చూపించనున్నారు. అలాగే, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ లండన్‌లో ప్రారంభం కానుంది. ఎ. హవీశ్‌ ప్రొడెక్షన్‌లో నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి కూడా రమేశ్‌ వర్మనే దర్శకత్వం వహించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu