HomeTelugu Trendingనోటీసులు అందలేదంటున్న రకుల్‌.. ఖండించిన అధికారులు

నోటీసులు అందలేదంటున్న రకుల్‌.. ఖండించిన అధికారులు

Rakul said no ncb summons r

హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు హీరోయిన్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారని వార్తలు వినిపించాయి. అయితే, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌, ముంబైలో ఎక్కడా ఎన్సీబీ నుంచి సమన్లు అందలేదని తన‌ మేనేజర్ ద్వారా‌ ఒక ప్రకటన విడుదల చేయించింది. కాగా, ఒక యాడ్‌ లో షూట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆ భామ నిన్న రాత్రి తిరిగి ముంబైకి వెళ్లింది.

తనకు సమన్లు అందలేదంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. రకుల్‌కు సమన్లు జారీ చేశామని, ఆమె ఫోన్‌లో అందుబాటులోకి లేకపోవడంతో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించామని చెప్పారు. అయితే, ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆమె ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. కాగా రోజు (సెప్టెంబర్ 24)శృతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న.. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

డ్రగ్స్‌ కేసులో ఆ నలుగురు హీరోయిన్‌లకు సమన్లు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu