సాదరణంగా ఫ్యాన్స్.. అభిమాన హీరో పుట్టి రోజును ఓ పండగలా సెలబ్రేట్ చూస్తుంటారు. అయితే త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. యధావిధిగా అభిమానులు తమ హీరో పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రెట్ చెయ్యాలని నిర్ణయించారు. కానీ అభిమానులకు మన మెగా హీరో పెద్ద షాక్ ఇచ్చాడు. తన బర్త్డే ని జరుపుకోవద్దని అభిమానుల కోరాడు . కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే డైలాంగ్ కింగ్ మోహన్ బాబు తన పుట్టిన రోజు వేడుకలని జరపొద్దని పిలుపునివ్వగా, తాజాగా రామ్ చరణ్ లేఖ ద్వారా విన్నవించారు. ఈనెల 27 న తన పుట్టిన రోజు నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు వేడుకలకి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్టీఆర్తో కలిసి వీడియో ద్వారా కరోనా నుండి ఎలా కాపాడుకోవాలో, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు జరుపుకోకపోవడమే ఫ్యాన్స్ తనకిచ్చే అతిపెద్ద బహుమతి అని చరణ్ అన్నాడు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం కరోనా వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని కోరాడు రామ్చరణ్.
Megapower Star Ram Charan requests his fans to avoid public gatherings and cancellation of his birthday celebrations. He requests his fans to spread awareness about ways to avoid spread of #Covid19 Virus. pic.twitter.com/KpeIh6pdhT
— BARaju (@baraju_SuperHit) March 18, 2020