HomeTelugu Big Storiesచచ్చిపోతావ్‌.. కరోనాకు రామ్‌ గోపాల్‌ వర్మ వార్నింగ్‌

చచ్చిపోతావ్‌.. కరోనాకు రామ్‌ గోపాల్‌ వర్మ వార్నింగ్‌

10 2
మొన్నటి వరకు చైనా, చైనా వెలుపల ఆసియా, ఐరోపా దేశాలను గజగజలాడించిన కరోనా ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ అయ్యింది. దుబాయ్, ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తుల వలన ఈ వైరస్ ఇండియాలో కూడా వ్యాపించింది. అయితే, ఈ వైరస్ ఇండియాలో ఎంటర్ కావడంతో ప్రజలందరూ అప్రమత్తం అయ్యారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా అందరూ కరోనా వైరస్ కు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనాను భయపెడుతున్నాడు. దానికి తన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మనిషిని చంపాలని చూస్తున్నది. ఒకవేళ అది మనిషిని చంపితే ఆ మనిషితో పాటుగా అది కూడా చనిపోతుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu