HomeTelugu Trendingఉదయాన్నే.. అవి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

ఉదయాన్నే.. అవి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

6 27
హీరోయిన్‌ రష్మిక మందన్నా.. ఉదయం నిద్రలేవగానే సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చూసి భావోద్వేగానికి గురయ్యారట. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. కన్నడ చిత్రం ‘కిర్రాక్‌పార్టీ’తో రష్మిక హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. 2016 డిసెంబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక పలు కన్నడ, తమిళ చిత్రాలతోపాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. నేటితో రష్మిక సినిమాల్లోకి వచ్చి మూడేళ్లు అయిన సందర్భంగా నెటిజన్లు, అభిమానులు ‘3ఇయర్స్‌ఆఫ్ రష్మిక ఇన్‌ సినిమా’ అనే పేరుతో కామన్‌ డీపీని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అభిమానులు షేర్‌ చేసిన ఫొటోలకు రష్మిక ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె ఓ స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈరోజు నా ఉదయం వీటితోనే ప్రారంభమైంది. వీటిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి. ఎంతో ఎమోషనల్‌ అయ్యాను. కష్టానికి ప్రతిఫలమిది. మీకు మరిన్ని మంచి చిత్రాలను అందించడానికి మరింత కష్టపడతాను. ఐ లవ్‌ యూ’ అని పేర్కొన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!