మాస్మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ఇందులో రవితేజ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘డాన్శీను’, ‘బలుపు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.