HomeTelugu Trending20 ఏళ్ల జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..!

20 ఏళ్ల జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..!

2 20
రేణు దేశాయ్ హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం బద్రి విడుదలై ఇప్పటికి 20 ఏళ్లు గడిచింది. ఈ చిత్రంతోనే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంతోతనకున్న అనుబంధాన్ని రేణు గుర్తుచేసుకున్నారు. అప్పటి విశేషాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే పవన్, రేణు మధ్య ప్రేమ పుట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ ఫొటోలు తీసిన సమయంలో తాను పవన్ కల్యాణ్‌తో ముచ్చటించిన మాటలు ఇంకా గుర్తున్నాయంటూ ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో వీటిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu