HomeTelugu Trendingకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా కేసు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్‌

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా కేసు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్‌

RP patnaik on sai dharam te

హీరో సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘యాక్సిడెంట్‌ విషయంలో అతివేగంకేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలి. ఈ చర్యల వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం’ అని పోస్టు పెట్టారు.

రాయదుర్గం పరిధిలో శుక్రవారం రాత్రి సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్‌ బ్రిడ్జ్‌ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మాదాపూర్‌ ఏసీపీ ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu