HomeTelugu Trendingపుకార్లపై ఘాటుగా స్పందిన ఎస్‌ జాన‌కి..

పుకార్లపై ఘాటుగా స్పందిన ఎస్‌ జాన‌కి..

6 25

లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్‌. జాన‌కి ఇక లేరంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫేక్ న్యూస్ వైర‌ల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన ఆమె అభిమానులు వ‌రుసగా ఫోన్ లు చేస్తూ విల‌పిస్తున్నార‌ట‌. కాగా ఇప్పటికే దీనిపై బాలసుబ్రహ్మాణ్యం స్పందించారు. ఇక తాజాగా త‌న‌పై వ‌స్తున్న ఫేక్ న్యూస్‌పై జాన‌కీ మండిప‌డ్డారు.

`నేను ప్ర‌స్తుతం మైసూర్‌లో వున్నాను. హైద‌రాబాద్‌లో లేను., నేను చాలా ఆరోగ్యంగా ఫ‌స్ట్ క్లాస్‌గా వున్నాను. నాకు ఏమీ కాలేదు. ఎవ‌రెవ‌రో పిచ్చి పిచ్చిగా న్యూస్ పెడుతుంటారు. అలాంటి వార్త‌ల్ని న‌మ్మితే మ‌నం ఏమీ చేయ‌లేం. చాలా మంది అభిమానులు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. వారిని ఓదార్చ‌డ‌మే స‌రిపోయింది. పిచ్చి పిచ్చిగా వాళ్లు చ‌చ్చారు.. వీళ్లు చ‌చ్చారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. నేను బాగానే వున్నా. హైద‌రాబాద్‌లోనే క‌రోనా తీవ్రంగా వుంద‌ని తెలిసింది మీరు జాగ్ర‌త్త‌గా వుండండి` అంటూ అభిమానుల‌కు జాన‌కి జాగ్ర‌త్త‌లు చెబుతూ ఓ ఆడియో సందేశాన్ని పంపించారు. ప్ర‌స్తుతం ఈ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu